ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్!

ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్!

KNR: ఇందిరమ్మ ఇళ్లకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే కొత్త ఇళ్లు మంజూరు కానున్నాయి. దీంతో ఎంపిక చేసిన లబ్ధిదారులకు మార్చిలో ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం. జనవరి 26న పథకం ప్రారంభం కాగా 71,500 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేసింది. మరోవైపు పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీకి లేఖ రాయనున్నారు.