మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు

మేనేజర్‌పై వేధింపుల ఆరోపణలు

మహబూబ్‌నగర్‌లోని ఓ సంస్థ మేనేజర్ మధుకర్ రెడ్డిపై ఉద్యోగం కోసం వచ్చిన మహిళను వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో బీసీ సమాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుడిపై తక్షణ చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోమవారం మెట్టుగడ్డలోని సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్ తెలిపారు.