'నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ'
GDWL: రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సీసీఐ కొనుగోళ్ల బంద్ను ఉపసంహరించుకోవడం జరిగిందని కలెక్టర్ సంతోష్ గురువారం తెలిపారు. అందులో గద్వాల జిల్లాలో నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.