'ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలి'
MHBD: ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలని మహబూబాబాద్ ఎస్పీ శబరిష్ అన్నారు. రెండవ విడత ఎన్నికలు జరిగే బయ్యారం, కొత్తపేట పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. తగు సూచనలు చేశారు. 144 సెక్షన్ను కఠినంగా అమలు చేయాలని, ఎన్నికల నియమావళిని ఎవరూ అతిక్రమించకూడదని, పార్టీలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎస్సై తిరుపతి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.