మిడ్ మానేరుకు భారీగా వరద నీరు

SRCL: శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎస్సారెస్పీ గాయత్రి పంప్ హౌస్ ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం వరకు 17600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. గాయత్రి పంప్ హౌస్ నుంచి 4600 వేలు, ఎస్సారెస్పీ నుంచి ఇందిరమ్మ వరద కాలువ ద్వారా 12600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.