క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ

సత్యసాయి: పరిగి మండల పరిధిలోని ధనాపురం హైవే వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం MP బికే. పార్థసారథి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి మృతదేహాలకు నివాళులర్పించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.