8 ఎకరాలకు హైడ్రా ఫెన్సింగ్..!
HYD: శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ విలేజ్లో 8 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులతో కలిసి విచారించారు. అనంతరం ప్రభుత్వ భూమిగా నిర్ధారించుకుని ఆక్రమణలను తొలగించి, భూమి చుట్టూ హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేయించారు.