డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు
SRCL: బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. తంగళ్ళపల్లికి చెందిన గంగ ప్రవీణ్ను నీ ట్రాక్టర్ను పోలీసులకు పట్టిస్తామని బెదిరించి రూ. 1500 వసూలు చేసిన రంగు శ్యామ్, మిడిదొడ్డి ప్రశాంత్లపై కేసు నమోదు చేశామన్నారు.