బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో విశాఖకు పెద్దపీట

VSP: బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం ప్రకటించారు. అందులో విశాఖపట్నం వారికి అధిక ప్రాధాన్యం లభించింది. గత కమిటీలో కోశాధికారిగా పనిచేసిన మొగళ్ల నాగేంద్రను అదే పదవిలో మాధవ్ కొనసాగించారు. ఇక అనకాపల్లి జిల్లా నుంచి ఆడారి ఆనంద్కుమార్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు.