రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గంలో కీలకమైన నందివెలుగు – ఆటో నగర్ (తెనాలి–మంగళగిరి) రహదారి అభివృద్ధి పనులకు రూ. 2.00 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.