లచ్చిరాం తండా సర్పంచ్‌గా BRS అభ్యర్థి

లచ్చిరాం తండా సర్పంచ్‌గా BRS అభ్యర్థి

KMM: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండాలో సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు సుశీల విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్‌లో సమీప అభ్యర్థిపై 42 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయం పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.