ప్రత్యేక అలంకరణలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం పాత బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చింది. ఉదయాన్నే అర్చకులు అమ్మవారి శిల విగ్రహానికి ఫల పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యలను సమర్పించారు. అనంతరం భక్తులు మారెమ్మను దర్శించారు.