పైడిభీమవరంలో డిప్యూటీ MPDO పర్యటన
SKLM: రణస్థలం మండలం పైడిభీమవరం గ్రామంలో డిప్యూటీ ఎంపీడీఓ జి. ప్రసాద్ శుక్రవారం పర్యటించి, మెగా డ్రైవ్లో జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ఫీల్డ్లో ఉండి సర్వేను పూర్తి చేయాలని, సమస్యలు ఉంటే మండల కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ సూర్యకుమారి పాల్గొన్నారు.