క్షయ వ్యాధిపై అవగాహన అవసరం: శ్రీకాంత్
WNP: అవగాహనతో క్షయ వ్యాధిని అరికట్టవచ్చని గ్రామీణ వైద్యుడు శ్రీకాంత్ తెలిపారు. ఘనపూర్ మండలం ఆగారంలో ఇవాళ నిర్వహించిన ప్రత్యేక హెల్త్ క్యాంప్లో ఆయన మాట్లాడుతూ.. పొగాకు, ఆల్కహాల్ అలవాటు ఉన్నవారు, 60ఏళ్ళు పైబడినవారు, క్షయ వ్యాధి లక్షణాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఎక్సరేలు, గల్ల పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత మున్నూరు జయకర్ పాల్గొన్నారు.