అతడేమీ భారత్కు రావడంలేదుగా: మాజీ కెప్టెన్
పాక్ స్పిన్నర్ అబ్రార్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంతో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు SRHపై పడుతుందా? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే, అలాటిందేమీ ఉండదని భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా తెలిపింది. అతడేమీ భారత్కు రావడంలేదు కదా.. యూకే లీగ్లో జరిగిన దానిని ఇక్కడికి ఆపాదించుకుని కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పింది.