అర్థరాత్రి ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

అర్థరాత్రి ప్రమాదం.. లారీ ఢీకొని వ్యక్తి మృతి

VSP: జాతీయ రహదారి పాత గాజువాక కూడలిలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందారు. పాత గాజువాక సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో BHPV నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు క్షత గాత్రుడిని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతిచెందినట్లు సీఐ హుస్సేన్ తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.