పోక్సో కేసులో ప్రభుత్వ ఉద్యోగికి పాతికేళ్ల జైలు
HYD: పోక్సో కేసులో ప్రభుత్వ ఉద్యోగి అయిన సర్దార్ త్రిలోక్ సింగ్ (50)కు నాంపల్లి కోర్టు నిన్న శిక్ష ఖరారు చేసింది. తిలక్నగర్ ఇందిరానగర్ లో నివసించే నిందితుడు 2024 జూన్లో రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి అనిత, నిందితుడికి 25 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.