సాంబారులో తేనెటీగ.. యాజమాన్యానికి భారీ జరిమానా
NGKL: కల్వకుర్తిలోని ఒక హోటల్లో సాంబారులో చనిపోయిన తేనెటీగ కనిపించడం కలకలం రేపింది. దీనిపై ప్రశ్నించిన వినియోగదారుడికి యాజమాన్యం బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడంతో, బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత హోటల్లో తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి భారీ జరిమానా విధించారు.