నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి 5వ విడుత నీటి విడుదల
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా పంట సాగు కోసం 5వ విడతలో భాగంగా సోమవారం 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.887 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. ఈ నీటితో ఆయా పరిధిలోని రైతులు నీటిని పొదుపుగా పంట సాగుకు ఉపయోగించుకోవాలన్నారు.