నల్లజర్ల ప్రమాదం.. క్షతగాత్రుడిని MLA పరామర్శ
E.G: నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున కారు సూచిక బోర్డును ఢీకొట్టడంతో తాళ్లపూడి మండలం గజ్జరంకి చెందిన చాపర్ల హనుమంతరావు(45), చాపర్ల రాజు(40), కొవ్వూరుకి చెందిన దుద్దుపూడి సాగర్(41) అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గన్నిన నరేంద్ర తీవ్రంగా గాయపడగా రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని MLA వెంకటేశ్వరరావు ఇవాళ పరామర్శించారు.