'మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం'
అన్నమయ్య: మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహనీయుల ఆదర్శాలతో సమసమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొంటూ, యువత, పోలీసు సిబ్బంది సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.