మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంత్రి నారా లోకేష్ను టీడీపీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాతపట్నం నియోజకవర్గంలోని విద్యా, మౌలిక వసతుల అభివృద్ధిపై పలు ముఖ్యమైన ప్రతిపాదనలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్తూరు మండలం అభలాసింగి గిరిజన గ్రామం GPS పాఠశాలకి నూతన భవనం ఏర్పాటు చేయాలని కోరారు.