ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్
పార్వతీపురం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద గల ఈవీఎం గోదామును కలెక్టర్ N.ప్రభాకరరెడ్ది తనిఖీ చేశారు. నెల వారీ తనిఖీలో భాగంగా ఇవాళ ఆయన గోదాములను సందర్శించారు. గోదాములకు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో DRO హేమలత, తదితరులు పాల్గొన్నారు.