రెస్టారెంట్లో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు
PDPL: గోదావరిఖనిలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్లో బుధవారం ఆహార భద్రతా అధికారులు దాడులు చేశారు. రెస్టారెంట్లో ఈ తనిఖీకి సంబంధించి రెస్టారెంట్ వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పిండి పదార్థాలలో బొద్దింకలు ఉండటాన్ని గమనించిన వాటిని అక్కడికక్కడే పార వేయించారు. యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ అరవింద్ రెడ్డి తెలిపారు.