దౌర్జన్యంగా భూమి ఆక్రమణకు ప్రయత్నాలు

దౌర్జన్యంగా భూమి ఆక్రమణకు ప్రయత్నాలు

AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డంపాలెం గ్రామంలో కొవ్వూరు సుబ్బరాజు అనే సాధువు తనకు వీలునామా రాసిన మూడున్నర ఎకరాల భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించుకోవడానికి చూస్తున్నట్లు రైతు సుబ్బన్న తెలిపారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధువు గత ఏడాది మృతిచెందే ముందు ఆయనకు సంబంధించిన భూమిని తన పేరు మీద వీలునామా రాసినట్లు తెలిపారు.