'పీఎం సూర్యగ్రహ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'

తూ.గో: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజమహేంద్రవరం ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీధర్ వర్మ అన్నారు. అనపర్తి ప్రెస్క్లబ్లో బుధవారం ఈ పథకం గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు వినియోగ ఛార్జీలు తగ్గించుకునేందుకు పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.