పోలీస్ ఔట్ పోస్ట్ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కామారెడ్డిలో వినాయక నిమజ్జన శోభయాత్ర సందర్భంగా SP రాజేష్ చంద్ర ప్రత్యేక పోలీస్ ఔట్ పోస్టును ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి అవుట్ పోస్ట్ను SP, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రత్యేక డ్రోన్ను కలెక్టర్ ఆపరేట్ చేసి చూశారు. ఈ డ్రోన్తో నిమజ్జన యాత్ర తీరు అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు. అవుట్ పోస్ట్ గురించి ఎస్పీ కలెక్టర్కు వివరించారు.