ప్రత్యేక అలంకారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారమ్మ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువ జామునే అమ్మవారి శిల విగ్రహానికి అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.