కలింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా సంతోష్ కుమార్
SKLM: ఏపీ ప్రభుత్వం ఇవాళ పలు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఈ క్రమంలో ఇచ్చాపురానికి చెందిన వాన సంతోష్ కుమార్ను రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంతోష్ కుమార్ నియామకంపై కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతోష్ కుమార్ ఎమ్మెల్యే అశోక్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.