చింతలపూడి ఎమ్మెల్యే విజ్ఞప్తి

ELR: పెన్షన్లు రద్దయిన వారికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ విజ్ఞప్తి చేశారు. 40% పైగా వికలాంగ శాతం ఉన్నప్పటికీ పెన్షన్ రద్దయిన పింఛనుదారులు 15 రోజుల్లోపు ఏలూరు జిజిహెచ్ హాస్పిటల్ మెడికల్ బోర్డుకు హాజరు కావాలన్నారు. అలాగే పెన్షన్ రద్దు చేసిన సర్టిఫికెట్, పాత పెన్షన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మెడికల్ బోర్డు అప్లికేషన్ సమర్పించాలన్నారు.