'జనగణనను అందరూ వినియోగించుకోవాలి'
VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన జాతీయ జనాభా గణనలో భాగంగా గురువారం సెల్ఫ్ ఎమ్యునరేషన్ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన వివరాలను ఆన్లైన్లో స్వయంగా నమోదు చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ సులభంగా, పారదర్శకంగా ఉంటుందని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొందరు నాయకులు ఆయనను సత్కరించి జ్ఞాపిక అందజేశారు.