ముత్యాలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు
TPT: సూళ్లూరుపేట డిపో నుంచి తూర్పు కనుపూరులో జరిగే ముత్యాలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి బస్సులను ప్రారంభించారు. మార్చి 13 వరకు నాలుగు రోజులపాటు ఈ బస్సులు నడుస్తాయని డిపో మేనేజర్ తెలిపారు. మహిళలకు స్త్రీ శక్తి పథకం కూడా వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.