గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక ప్రకటన

గ్యాస్ సరఫరాపై కలెక్టర్ కీలక ప్రకటన

సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ పాఠశాలలకు టొరెంట్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఇప్పటికే 60 కి.మీ. మేర పైపైన్ విస్తరణ పూర్తయిందని, ఇది పూర్తి సురక్షితమని పేర్కొన్నారు. తగినంత గ్యాస్ నిల్వలు ఉన్నాయని, తొలుత ప్రభుత్వ సంస్థలకు, ఆ తర్వాత గృహాలకు ఇస్తామన్నారు.