'దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి'
ATP: అకాల వర్షాల వల్ల ఉరవకొండ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, కనీస మద్దతు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. బెలుగుప్ప, కూడేరు మండలాల్లో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయని, అధికారులు నష్టాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు.