'విశాఖ పోర్ట్ పూల్ కళాసీల సమస్యలు పరిష్కరించాలి'
విశాఖ పోర్ట్ పూల్ కళాసీలకు పదోన్నతి కల్పించి, టైం స్కేల్ జీతాలు ఇవ్వాలని అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కోరారు. పూల్ కళాసీల అధ్యక్షుడు సమయం హేమంత్ పోర్ట్ సెక్రెటరీ వేణుగోపాల్కి గురువారం వినతిపత్రం అందజేశారు. వేణుగోపాల్ ఒరిస్సాలోని పారదీప్ పోర్టుకు ఐఏఎస్ స్థాయి డిప్యూటీ ఛైర్మన్గా పదోన్నతి పొందడాన్ని ఈ సందర్భంగా అభినందించారు.