సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

సమస్యలను పరిష్కరించాలని కమిషనర్‌కు వినతి

NLR: బుచ్చి పట్టణంలోని రేబాల కాలువ చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధమైన వాసన వస్తుందని బీజేపీ నాయకులు నగర కమిషనర్ బాలకృష్ణకు తెలియజేశారు. పలు సమస్యలపై జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కాలువలో నీళ్లు ప్రవహించే విధంగా చెత్తను తొలగించాలన్నారు. మలిదేవి బ్రిడ్జి వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.