ఎయిర్ షో నుంచి తప్పుకున్న అమెరికా పైలట్
భారత వైమానిక దళానికి చెందిన తేజస్ యుద్ధ విమానం దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది. ఐఏఎఫ్ పైలట్ మరణించారు. అయినప్పటికీ నిర్వాహకులు ఎయిర్ షో కొనసాగించడంపై అమెరికా వైమానిక దళానికి చెందిన పైలట్ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఆ పైలట్ గౌరవార్థం ఎయిర్ షో నుంచి తన బృందం తప్పుకున్నదని ఆయన వెల్లడించారు.