బెజుగామకు బస్సు సౌకర్యం ప్రారంభం
SDPT: గజ్వేల్ మండలం బెజుగామ గ్రామం నుంచి గజ్వేల్ వరకు కొత్తగా ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యాన్ని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి బుధవారం ప్రారంభించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి సహకారంతో ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చిందని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం ఈ బస్సును ఏర్పాటు చేశామన్నారు.