తడి, పొడి చెత్తపై అవగాహన

RR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘ఒక మార్పు అభివృద్ధికి మలుపు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది ప్రజలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.