ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ

TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరో భారీ అర్బన్ పార్క్ ఏర్పాటుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 424.31 ఎకరాల అటవీ భూభాగాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించింది.