ఏటూరునాగారంలో నేడు ప్రజావాణి–గిరివాణి

ఏటూరునాగారంలో నేడు ప్రజావాణి–గిరివాణి

MLG: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి, గిరివాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ దివాకర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.