గిరిజనులకు మౌలిక వసతులు

గిరిజనులకు మౌలిక వసతులు

PLD: గిరిజన ఆవాసాల్లో మౌలిక వసతుల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ కృతిక ఆదేశించారు. పీఎం జన్‌మన్, జుగా పథకాలపై నరసరావుపేటలో ఆమె సమీక్షించారు. పీఎం జన్‌మన్ కింద రూ.41.38 కోట్లతో చెంచులకు ఇళ్లు, తాగునీరు, విద్యుత్, టవర్లు ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ లేనిచోట సోలార్ ప్యానెళ్లు అమర్చాలన్నారు. పీఎం జుగా కింద 7 గ్రామాల్లో రూ.18 కోట్లతో పనులు చేపట్టాలన్నారు.