ఎరుకుల సంఘం నూతన అధ్యక్షులుగా బాబు
CTR:పుంగనూరు ఎరుకుల సంఘం కమిటీ అధ్యక్షులను రాష్ట్ర వర్కింగ్ కమిటి ప్రెసిడెంట్ సాకే చిరంజీవి నియమించారు. జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో సమావేశం నిర్వహించారు. పుంగనూరు పట్టణ అధ్యక్షుడుగా మర్రిమాకులపల్లె బాబు, మండల అధ్యక్షుడుగా విజయకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్ద పంజాణి మండల అధ్యక్షుడుగా శ్రీనివాసులు ఎంపికయ్యారు.