తాగునీరు సౌకర్యం కల్పించాలని డిమాండ్
ASR: పాడేరు మండలం వంటలమామిడి పంచాయతీ పరిధిలోని మెట్టూరు గ్రామంలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలని స్థానికులు బుధవారం డిమాండ్ చేశారు. గ్రామంలో వేసిన కొళాయికి నీరు రాకపోవడంతో పాడుబడ్డ నుయ్యి నీరు తాగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రుల పాలవుతున్నామని తెలిపారు.