'పీటీఎం-3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'
ELR: విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం ప్రభుత్వం రూపొందించిన 'పీటీఎం-3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భీమడోలు MEO శ్రీనివాసరావు కోరారు. మండలంలో విద్యార్థుల తెలుగు, లెక్కలు ,ఇంగ్లీషు సబ్జెక్టుల కనీస సామర్ధ్యాలను పరిశీలించేందుకు ఆన్లైన్ కార్యక్రమం ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల సహకారంతో కొనసాగుతోందన్నారు.