గర్భిణీకి అండగా ఆశ్రయ అనాథాశ్రమం
ATP: కళ్యాణదుర్గం వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేని మహిళకు ఆశ్రయ అనాథాశ్రమం అండగా నిలిచింది. ఏడు నెలల క్రితం సామాజిక కార్యకర్త శశికళ చొరవతో ఆమెను ఆశ్రమానికి చేర్చారు. పరీక్షల అనంతరం ఆమె గర్భవతి అని తేలడంతో నిర్వాహకులు దేవి కృష్ణారెడ్డి కుటుంబం సంరక్షణ బాధ్యతలు చేపట్టింది. ఈ నెల 19న ప్రసవం జరిగే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.