ఆర్డీటీ సేవలకు ఇబ్బంది లేదు: మాంచో ఫెర్రర్

ఆర్డీటీ సేవలకు ఇబ్బంది లేదు: మాంచో ఫెర్రర్

ATP: జిల్లాలో ఆర్డీటీ సేవలకు ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదని ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ స్పష్టం చేశారు. ఎఫ్సీఆర్ఏ సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్న దివ్యాంగ సంఘాల నాయకులతో బత్తలపల్లి ఆసుపత్రిలో ఆయన చర్చించారు. వైద్య సేవలు, విద్యా సౌకర్యాలపై భరోసా ఇచ్చారు. ప్రస్తుతం రెండు మూడు నెలల వరకు సేవలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని వివరించారు.