VIDEO: సంక్షేమ పథకాలపై గ్రామ సభలో అవగాహన
PDPL: ధర్మారం మండలం కాణంపల్లిలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. GP కార్యదర్శి సతీష్ లబ్ధిదారుల వివరాలు సభలో వెల్లడించారు. సర్పంచ్ సుగుణ మాట్లాడుతూ... మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.