'ఏనుగుల సంచారం రైతులు అప్రమత్తంగా ఉండాలి'

'ఏనుగుల సంచారం రైతులు అప్రమత్తంగా ఉండాలి'

PPM: గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలో పామాయిల్ తోటలో గురువారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. అటువైపుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ నిరంతరం ఏనుగుల కదలికలను గమనిస్తూప్రజలను అప్రమత్తం చేస్తుంటారని, ప్రజలు కూడా సహకరించాలని ఫారెస్ట్ అధికారులు కోరారు.