విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందే జగన్: మంత్రి

AP: రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేసిందే మాజీ సీఎం జగన్ అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. యాక్సిస్తో విద్యుత్ ఒప్పందానికి ఎవరెంత పెట్టారో చర్చకు జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో యాక్సిస్ నుంచి యూనిట్కు రూ.5.15కు కొన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక యూనిట్ ధరను రూ.4.60కి తగ్గించిదని వెల్లడించారు.